ఎన్టీఆర్‌ను కలిసిన టీమిండియా ఆటగాళ్లు

by Disha Web Desk |
ఎన్టీఆర్‌ను కలిసిన టీమిండియా ఆటగాళ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సోమవారం రాత్రి టీమిండియా ఆటగాళ్లు కలిశారు. రేపు న్యూజిల్యాండ్‌తో జరిగే తొలివన్డే కోసం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు నగరంలో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యుజువేంద్ర చహల్, శార్దుల్ ఠాకూర్ తదితరులు జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి సందడి చేశారు. వీళ్లంతా ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇటీవల ఖరీదైన కార్ కలెక్షన్స్‌తో హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ ఆకట్టుకున్న విషయం తెలిసే ఉంటుంది. ఆ నజీర్‌ఖాన్‌కు టీం ఇండియా ప్లేయర్స్‌లో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నజీర్ ద్వారా ఆయన ఇంట్లోనే ఎన్టీఆర్‌ను టీంఇండియా ప్లేయర్స్ కలిశారు.

Read More:

నాకు పెళ్లి అయింది.. దూరం జరుగు అంటున్న Rakhi Sawant



Next Story